Tuesday, 25 February 2025

సత్త్వా త్సంజాయతే జ్ఞానం

సత్త్వా త్సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతోఽజ్ఞానమేవ చ॥17॥ శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము ఏ విషయం అయినా ఒకటికి నాలుగు సార్లు మననం చేసుకుంటే కానీ బుర్రకు ఎక్కదు.ఈ విషయం కృష్ణుడికి చాలా బాగా తెలుసు.అందుకే మళ్ళీ మళ్ళీ అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!సత్త్వగుణం వలన మనిషిలో జ్ఞానం పెరుగుతుంది.అదే రజోగుణము వల్లన అయితే లోభం పెరుగుతుంది.తమోగుణం వలన మనలో అజ్ఞానానికి అంతమే ఉండదు.భ్రాంతి,ప్రమాదాలు ఏర్పడతాయి.కాబట్టి మనము నిశితంగా ఆలోచించి,మంచి మార్గంలో ముందుకు పోవాలి.

No comments:

Post a Comment