Monday, 21 July 2025
రాగీ కర్మఫలప్రేప్సుః
రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్ధో హింసాత్మకోఽశుచిః।
హర్ష శోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః॥27॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో చెబుతున్నాడు.అర్జునా!మనం ఫలాపేక్ష మాని,స్థిర చిత్తంతో కర్మలను ఆచరించేవాడు సాత్త్విక కర్త అని మాట్లాడుకున్నాము కదా!అలానే రాజస కర్త ఎలా ఉంటాడో చెబుతాను విను.ఇక్కడ తను చేసే ప్రతి పని యొక్క ఫలితం,అదే లాభనష్టాలు తనకే దక్కాలి అనే మానసిక స్థితిలో ఉంటాడు.అణువణువునా అహంకారము,అభిమానము,లోభగుణము తొణికిస లాడుతుంటాయి.తను అనుకున్న పని తను అనుకున్నట్లే జరగాలి అనే తపనలో హింసాపరుడు అవుతాడు.తన పని త్వర త్వరగా జరిగి పోవాలి అనే ఆదుర్దాలో శుచిని పాటించడు.అశుచిగా చేస్తుంటాడు.సుఖం వస్తే ఎగిరి గంతులేసి ఊరంతా సంబరాలు చేయడం,దుఃఖం వస్తే ముసుగేసుకుని,మూలన కూర్చొని దిగేడవడము చేస్తుంటాడు.అంటే ఫలితాలకు అలా విపరీతంగా చలిస్తూ ఉంటాడు.రెండిటినీ ఒకే రకంగా తీసుకోగలిగే స్ధిరచిత్తం, సమన్వయ శక్తి ఉండదు.ఇలాంటి నేపధ్యంలో కర్మలు ఆచరించే వారిని రాజస కర్త అని అంటారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment