Thursday, 3 July 2025
శరీరవాజ్ఞ్మనోభి ర్యక్కర్మ
శరీరవాజ్ఞ్మనోభి ర్యత్కర్మ ప్రారభతే నరః।
న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః॥15॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి బాగా అర్థం కావాలని ఇంకా విపులంగా చెబుతున్నాడు.ఓ అర్జునా!నిజానికి నేను పైన చెప్పినట్లు శరీరం,అహంకారం,ఇంద్రియాలు,ప్రక్రియా పరమైన వివిధ కార్యాలు,పరమాత్మ ...ఈ అయిదే కర్తృత్వాన్ని నిర్వహిస్తున్నాయి.మనస్సు,వాక్కు,శరీరాలతో మనము చేసే ప్రతి ఒక్క గొప్పపనికి,నీచము అయిన పనికి ఈ అయిదే కారణాలు అని మర్చిపోవద్దు.కానీ అందరికీ ఈ విషయం అర్థం కావాలంటే బుద్ధి పరిపక్వత చెంది ఉండాలి కదా!అది అందరికీ ఉండదు కదా!బుద్ధి పరిపక్వత చెందనివాడూ,చెడుభావాల సుడిగుండంలో ఇరుక్కుపోయినవాడూ ఈ సాంఖ్య శాస్త్రాన్ని ససేమిరా నమ్మడు.అన్నిటికీ కర్త,కర్మ,క్రియ తానే అని భావిస్తూ,అజ్ఞానంలో మునిగి తేలుతుంటాడు.ఆ మాయలో మనిషి ఉన్నంతకాలం,అహంకారం అణువణువునా తొణికిసలాడుతుంటుంది.అతడు ఇక అంతా నేనే,నన్ను మించినవాడు లేడు ఈ ముల్లోకాలలో లేనే లేడు అనే మిడి మిడి జ్ఞానంతోనే సంచరిస్తూ ఉంటాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment