Saturday, 20 September 2025
నష్టం మోహః స్మృతిర్లబ్ధా
అర్జున ఉవాచ....
నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాఽచ్యుత।
స్థితోఽస్మి గతసందేహః కరిష్యే వచనం తవ॥73॥
శ్రీమద్భగవద్గీత....అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్సాస యోగము
అర్జునుడు శ్రీకృష్ణుడు ఇంత సేపూ చెప్పింది కళ్ళు ఆర్పకుండా,మనసునంతా లగ్నం చేసి,ఏకాగ్ర చిత్తంతో విన్నాడు.కృష్ణుడు నీకు ఏమి అర్థం అయింది?ఎంత మటుకు అర్థం అయింది అని అడగటంతో ఈ లోకం లోకి వచ్చాడు.అర్జునుడు ఇలా చెబుతున్నాడు.కృష్ణా!మాథవా!మథుసూదనా!నీవు ఎంతో ఓపికగా,ప్రేమగా,అనురాగంతో నాకు తెలియని విషయాలు,సరిగా అర్థం చేసుకోలేని విషయాలు చాలా చెప్పావు.నీ కృపాకటాక్షంవల్ల నా అజ్ఞానం సమసిపోయింది.ఇంక నాకు ఎటువంటి అనుమానాలు,శంకలూ లేవు.ఆత్మస్మృతి కలిగింది.అంటే ఆత్మజ్ఞానం కలిగింది.నాకు ఇకమీదట కర్త,కర్మ,క్రియ అన్నీ నీవే.నేను నీ నీడను మాత్రమే.నీవు ఏమి చెబితే,ఎలా చెబితే,ఎప్పుడు అని చెబితే,ఎక్కడ అని చెబితే అలాగే తు చ తప్పకుండా చేస్తాను.నేను నీ ఆజ్ఞ కోసరము శిరసు వంచి సిద్ధంగా,సమాయత్తం అయి ఉన్నాను.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment