య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి।
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్య త్యసంశయః॥68॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాల్సింది అంతా చెప్పాడు.ఇప్పుడు ముక్తాయింపు చెబుతున్నాడు.అర్జునా!నేను నీకు ఇప్పుడు అతి రహస్యమయిన,అత్యంత పవిత్రమయిన గీతా శాస్త్రాన్ని బోధించాను.ఈ పరమ పవిత్రమయిన శాస్త్రాన్ని నాభక్తులు అందరికీ చేర వేయాలి.ఎవరైతే ఈ కార్యాచరణలో సఫలీకృతులు అవుతారో,వారు ఖచ్చితంగా నాకు దగ్గర అవుతారు.పరమాత్మలో లీనం అవుతారు.ఇందులో అనుమానానికీ,సంశయానికీ తావే లేదు.
No comments:
Post a Comment