మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే।
సకృద్గీతాంభసి స్నానం సంసార మల నాశనమ్॥
మనము రోజూ స్నానంచేస్తాము.ఎందుకు?ఒంటికి అంటుకున్న దుమ్మూ,ధూళీ వదలగొట్టుకునేదానికే కదా!అదే మనసుకు పట్టిన దోషాలూ,ఘోషలూ,పాపపంకిలాలూ పోవాలంటే మనం ఇంకెంత శుభ్రంచేసుకోవాలి?వాటన్నిటికీ చెప్పిన చిన్న చిట్కానే ఈ భగవద్గీత.అదే ఈ శ్లోకంలో చెప్పబడింది.మంచి నీళ్ళతో స్నానం రోజూ చేస్తే ఒంటికి పట్టిన మురికి పోతుంది.గీతాభ్యాసము,గీతా పారాయణము అనే స్నానము మనము రోజూ చేస్తే మనసుకు పట్టిన చీడ,పీడ వదలిపోతాయి.అన్ని రకాల మాలిన్యాలకు స్వస్థి చెప్పవచ్చు.
No comments:
Post a Comment