Saturday, 27 September 2025
గీతాయాః పుస్తకం
గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే।
తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్రవై॥
ఈ భగవద్గీత అనేది మనకు దక్కడం మన పూర్వ జన్మ సుకృతం.ఈ మహద్ గ్రంథం ఎక్కడ ఉంటుందో అక్కడే అన్ని పుణ్య తీర్థాలూ,గయా ప్రయాగాదులూ ఉన్నట్లు లెక్క.ఎక్కడ ఈ శ్రీకృష్ణార్జునుల సంవాదం చదవబడుతుందో,అక్కడ ముక్కోటి దేవతలూ,మునులూ,యోగులూ,పన్నగులూ,నారదుడూ,ఉద్ధవుడూ,మిగిలిన మహానుభావులూ...అందరూ ఉన్నట్లు లెక్క.వాళ్ళందరూ ఉన్నారు అంటే మనలను ఆశీర్వదించే దానికే కదా!పుణ్య క్షేత్రాలు,పవిత్ర నదీ జలాలు ఉన్నాయి అంటే మనము పుణ్య స్నానాలు చేసినట్లే కదా!అంత పుణ్యం దక్కుతుంది మనకు.ఎక్కడ కృష్ణార్జునులు ఉంటే అక్కడ జయము,లక్ష్మీ,ఐశ్వర్యము ఉంటాయి అని చెప్పాడు కదా సంజయుడు.వారికి ప్రతీకగా ఉండే భగవద్గీత ఎక్కడ కొలవబడుతుందో,చదవబడుతుందో,ఆకళింపు చేసుకోబడుతుందో,వినబడుతుందో,పఠింపబడుతుందో అక్కడ ఖచ్చితంగా జయము,లక్ష్మి,ఐశ్వర్యము తాండవిస్తాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment