Friday, 26 September 2025
యత్ర యోగేశ్వరః కృష్ణో
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః।
తత్ర శ్రీర్విజయో భూతిః ధృవా నీతిర్మతిర్మమ॥78॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
కురుక్షేత్ర సంగ్రామం యొక్క ముగింపు ఏందో,ఎట్లా ఉంటుందో అనేది యుద్ధం మొదలు కాకుండానే సంజయుడికి కళ్ళకు కట్టినట్లు తెలిసి పోయింది.ధృతరాష్ట్రుడు శారీరకంగానే కాదు మానసికంగా కూడా గ్రుడ్డి వాడు కాబట్టి చివరాఖరుదాక కూడా తెలుసుకోలేక పోయాడు.సంజయుడు తన మనసుకు తట్టిన విషయం మొహమాటంలేకుండా,రాజు అని భయపడకుండా చెబుతున్నాడు.
ఓ ధృతరాష్ట్ర మహారాజా!నేను చెబుతున్నాను,విను.శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు.అర్జునుడు ధనుర్థారి.వీళ్ళిద్దరూ కలసి ఎక్కడ ఉంటే అక్కడ అన్నీ శుభాలే జరుగుతాయి.అక్కడ లక్ష్మీ దేవి స్థిర నివాసం ఏర్పరుచుకుంటుంది.అక్కడ ఎప్పుడూ గెలుపే! ఓటమి దరిదాపులకు కూడా వచ్చేదానికి వణికి చస్తుంది.అక్కడ ఐశ్వర్యము పిలవకున్నా తనే నడచి వచ్చి నట్టింట కూర్చుంటుంది.రాజా!నేను ఈ మాటలు ఆషామాషీగా అనటం లేదు.ఇది నా దృఢమయిన అభిప్రాయము.ఇది ముమ్మాటికీ నిజం!నిజం!నిజం!!!
శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్న్యాస యోగో నామ అష్టాదశోధ్యాయః!!!!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment