Wednesday, 11 February 2026

మాత్రా స్పర్శాస్తు కౌంతేయ

మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః। ఆగమాపాయినోఽనిత్యాః తాం స్తితిక్షస్వ భారత॥14॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడి ఓపికకి నిజంగా జోహార్లు!మాములుగా మన ప్రక్క వాడి కంటే మనము కొంచెము ఎక్కవ అనే భావము రాగానే మనకు కళ్ళు నెత్తికి ఎక్కుతాయి.ఎక్కువ తెలివి అనేది నిజమయినా,నిజం కాకపోయినా!అలాంటిది భగవంతుడు అయి కూడా అంత ఓపికగా,సులభంగా అర్థం అయ్యేలాగా చెబుతున్నాడు అంటే మనమంతా ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలి అని కొంచెం ఆలోచించాలి. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!మనము చలి అయినా,వేడి అయినా ఎట్లా తెలుసుకుంటాము?మన ఇంద్రియాల వలనే కదా!సుఖ దుఃఖాలు కూడా అంతే.ఇంద్రియాల వలనే కలుగుతాయి.ఆకాశంలో కదిలే మేఘాలలాగానే.ఈ క్షణం కనిపిస్తాయి.ప్రక్క క్షణం మాయమవుతూ ఉంటాయి.అవి అక్కడే పాతుకు పెట్టుకుని కూర్చోవు కదా!అవి శాశ్వతం కాదు.చంచలం.వస్తుంటాయి,పోతుంటాయి. ఇట్లా మనము ప్రతి చిన్న విషయానికి భావోద్వేగాలకు లోనయితే ఎలాగా?నీవే చెప్పు.

No comments:

Post a Comment