Tuesday, 24 February 2026

అవ్యక్తాదీని భూతాని

అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత। అవ్యక్త నిధనా న్యేవ తత్ర కా పరిదేవనా॥28॥2॥ శ్రీమద్భగనద్గీత....సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి చావు పుట్టుకల గురించి వివరిస్తున్నాడు.ఓ అర్జునా!భరత శ్రేష్టా!నువ్వు నిశితంగా గమనించు.ఈ సృష్టిలోని సకల భూతాలూ పుట్టకముందు మనకు కనిపిస్తున్నాయా?లేదు కదా!కానీ ఆ జీవులు అన్నీ పుట్టిన తరువాత కనిపిస్తున్నాయి కదా!ఎందుకంటావు?ఆలోచించు ఒక్క క్షణం. ఎందుకంటే కిందటి జన్మలో ఏ రూపంలో ఉన్నారో మనకు తెలియదు.చనిపోయిన పిమ్మట మరు జన్మలో ఎవరు ఏ రూపం పొందుతారో మనకెవరికీ తెలియదు గనక.అలాంటి బంధుకోటి గురించి నీవు తల పగలగొట్టుకోవడం ఎందుకు?ఈ దిగులు,విచారం,ఈ నిర్వీర్యం,నిస్సత్తువ,నిర్వికారం ఎందుకు?మనసును ప్రశాంతంగా పెట్టుకో!

No comments:

Post a Comment