Thursday, 12 February 2026

యం హి న వ్యథయం త్యేతే

యం హి న వ్యథయం త్యేతే పురుషం పురుషర్షభ। సమ దుఃఖ సుఖం ధీరం సోఽమృతత్వాయ కల్పతే॥15॥2॥ శ్రీమద్భగవద్గీత....సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.ఇవన్నీ వదిలేసెయ్యి.సుఖాలూ,దుఃఖాలూ ప్రతి ఒకేరి జీవితంలో సర్వ సాథారణము కదా!వాటికి మనము చలించడం మానేయాలి.అవి బాథ పెట్టాయని ఏడవడం,సుఖ పెట్టాయని గెంతులు వేయడం ముందు మానుకోవాలి.అవి మనలను ఏ రకంగానూ ప్రభావితం చేయకూడదు.ఆ స్థితికి మనము చేరాలి.ఇవన్నీ దాటుకుని పోతేకానీ మనకు మోక్షానికి అర్హత సంపాదించలేము. సుఖాలనూ దుఃఖాలనూ సమానంగా స్వీకరించగలిగే స్థితికి చేరుకున్నవారే మోక్షానికి అర్హులు అవుతున్నారు.

No comments:

Post a Comment