Monday, 16 February 2026

న జాయతే మ్రియతే

న జాయతే మ్రియతే వా కదాచి న్నాయం భూత్వా భవితా వా న భూయః। అజో నిత్య శ్శాశ్వతోఽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే॥20॥2॥ శ్రమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడికి అర్జునుడిని చూస్తే జాలి,దయ కలగటం లేదు.కోపం వస్తుంది.అయినా అన్నీ దిగమ్రింగుకోని ఇలా అంటున్నాడు. నేస్తమా!నేల చూపులు ఏంది?ఈ నీరసం,నిస్సత్తువ ఏంది?కాళ్ళూ,చేతులు వ్రేలాడేసుకుని ఈ బేల చూపులు ఏంది?ఈ చతికిలబడటం ఏంది? ముందర లెయ్యి అసలు.మనలను చూసి నలుగురు ఉత్తేజితులు కావాలి.పదిమందికి మనం ప్రామాణికంగా నిలవాలి.బెబ్బెబ్బే అంటూ ఈ దీనాలాపనలు,బొబ్బెబ్బో అంటూ ఏడుపులు ఏంది?చలనం తెచ్చుకో!నా కళ్ళలోకి చూడు.నేను చెప్పేది మనసు పెట్టి విని,ఆకళింపు చేసుకో! ఆత్మ పుట్టేది కాదు.దానికి చావు అనేది లేదు.అట్లా అని ఒకప్పుడు ఉండి,ఇంకోకప్పుడు లేకుండా ఉండదు.ఆత్మ జనితమయినది కాదు.దానికి మార్పులు,చేర్పులు,తక్కువలు,ఎక్కువలు అంటూ ఏమీ ఉండవు.దానికి నాశనం అనేది లేదు.అది సనాతనమయినది.అది చంపదు.చావదు,చావబడదు.అది ధరించిన శరీరం నశిస్తుంది, దానికి చావు ఉంది కానీ ఈ ఆత్మకు మటుకు చావు లేదు,నాశనం అవదు.

No comments:

Post a Comment