Sunday, 19 July 2026

జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా

జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః। యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మ కాంచనః॥8॥7॥ శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి యోగి శ్రేష్ఠుడు ఎలా ఉండాలో చెబుతున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!ఇప్పుడే నీకు పరమత్మానుభవము అనేది ఎలా పొందవచ్చో చెప్పాను కదా!ఇప్పుడు మనం యోగి శ్రేష్ఠుడు ఎలా ఉండాలో చెప్పుకుందాము.అందరినీ,అంతటినీ సమాన దృష్టి తో చూసేవాడు,చూడగలవాడే యోగి అని నా అభిప్రాయము.ఉదాహరణకు కొన్ని చెప్పుకుందాము.మనము మాములుగా ఏమి చేస్తాము?మనకు తెలిసిన వాళ్ళు,మనకు ఇష్టమయిన వాళ్ళు,మనమంటే ఇష్షమయిన వాళ్ళు కనిపిస్తే?ఎగిరి గంతేసి,వాళ్ళ చంకన ఎక్కినంత పని చేస్తాము.అదే మనకు శత్రువులు,మనమంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు,మనకు ఎవళ్ళని చూస్తే కోపం,విసుగు,చీదర నషాళం అంటుతుందో..అలాంటి వాళ్ళు ఎదురైతే ఏమి చేస్తాడు?పొద్దున లేయగానే ఎవరి మొఖం చూసామో...ఈ చండాలం అంతా ఎదురుపడుతుంది అని అనుకుంటాము కదా!ఇక్కడే మనకు,యోగికి తేడా కొట్టొచ్చినట్లు కనపడేది.యోగి శత్రువు,మిత్రుడు,తటస్థంగా ఉండేవాళ్ళు,ఉదాసీనంగా ఉండేవారు,మంచి మనసు ఉండేవారు,బంధువులు,సాథువులు,దుర్మార్గులు,దుష్టులు...ఇలా ఎవరైనా సరే...అందరి విషయంలోనూ ఒకేరకమైన భావముతో ఉంటారు.అతి ప్రేమలు,అతి శత్రుత్వాలు మనసుకు అనుకోరు,స్పందించరు.అలాంటి వారినే శ్రేష్ఠమయిన యోగి అని అంటారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తాము.జ్ఞానము,విజ్ఞానము యొక్క సహాయముతో మనిషి యోగి కావాలి.మట్టిని అయినా,రాయిని అయినా,బంగారాన్ని అయినా సమదృష్టితో చూడగలగాలి.స్థిరంగా అనగా కూటస్థంగా ఉండాలి.ఇంద్రియాలను జయించి,భగవద్భక్తిలో తరించిన వాడిని యుక్తుడు అని అంటారు.

No comments:

Post a Comment