యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు।
యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా॥17॥6॥
శ్రీ మద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!ఓ బావా!ఇప్పుడే అనుకున్నాము కదా,అతి వద్దు అని.కాబట్టి ఏమి చేద్దాము?మితంగా ఆహారం తీసుకోవాలి.మట్టసంగా నిద్ర విహారాలు పోవాలి.
అలాగే మితంగా నియత కర్మలు ఆచరించాలి.మితమైన మెలకువ కలిగి ఉండాలి.ఇలా అన్నీ మితంగా చేస్తూ,యోగాభ్యాసం చేసేవాడికి సర్వ దుఃఖాలూ నాశనమవుతాయి.యోగము సిద్ధిస్తుంది.
No comments:
Post a Comment