Sunday, 26 July 2026
సమం కాయశిరోగ్రీవం
సమం కాయశిరోగ్రీవం ధారయ న్నచలం స్థిరః।
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్॥13॥6॥
శ్రీమద్భగవద్గీత..।ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్దునుడికి యోగాభ్యాసం చేయడానికి ఎలా కూర్చోవాలి,చూపు దేనిపైన నిలపాలి అనే వివరాలు కూడా చెబుతున్నాడు.అంటే ఒక విషయం ఎంచుకుంటే...కూలంకషంగా దాని పూర్వాపరాలు అన్నీ తెలియచేయాలి అన్నమాట.సగం ఇక్కడ,సగం మింగేసి,సగం మనకే తెలియక,ఇంకొంచెం మర్చిపోయి,మరింకొంచెం...ఆ ఇది కూడా మనమే చెప్పాలా?ఆ మాత్రం ఇంగితం లేకపోతే ఎలా?మనషి అన్నాక!ఇలా ఆలోచించి మనం ఏదీ సంపూర్ణంగా చెప్పము.కానీ దేవదేవుడైనా ఎంత ఓపికగా చెబుతున్నాడు చూడు,అర్జునుడికి.అర్జునుడు ఏమీ అడ్డబాల కాదు.కానీ నేర్పించాలి అనుకున్నప్పుడు సంపూర్ణంగా తెలియచేయాలి.అది ధర్మం!
అర్జునా!కిరీటీ!శుభ్రమయిన ప్రదేశంలో,సముచిత ఆసనం ఏర్పరుచుకుని కూర్చోవాలి అని చెప్పాను కదా!అప్పుడు శరీరం,మెడ,శిరస్సు ఒకే లంబంలో ఉంచాలి.నేను ఇది ఎందుకు చెబుతున్నానంటే...కొంచెం మంది గూని లాగా ముందరకు వంగుతారు.లేకపోతే జారగిల పడతారు.అసలు పద్మాసనం వేసుకుంటారో,లేదో?కూర్చున్న తరువాత పక్కన ఏముంది?వెనక ఏమి జరుగుతుంది అని యావకు అటూ ఇచూ చూస్తుంటారు.అట్లా అంతా వేషాలు వేయకూడదు.కదలకుండా,చలన రహితంగా ఉండాలి.దిక్కులు చూడకుండా,చూపును ముక్కు కొన...అదే నాసికాగ్రం పైనే కేంద్రీకరించాలి.అర్థమయిందా?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment