Tuesday, 28 July 2026
యుంజన్నేవం సదాత్మానం
యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః।
శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థా మధిగచ్ఛతి॥15॥6॥
శ్రీమద్భగవద్గీత..।।ఆత్మ సంయమ యోగము.
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!ఓ కుంతీపుత్రా!నేను చెప్పాను కదా ఇప్పుడు.మనసు ప్రశాంతంగా ఉంచుకుని,బ్రహ్మచర్యం పాటిస్తూ,నా ధ్యాసనుంచి పక్కకు మరలకుండా యోగాభ్యాసం చెయ్యాలి అని.ఎంత సేపు అని చెప్పలేదు కదా!మాములుగా అట్లా చెప్పక పోతే మనం ఏమి చేస్తాము?ఓం,ఓం,ఓం అను గట్టిగా ఐదు నిముషాలు అంటాము.తరువాత నుంచి చిన్నగా ఒక కన్ను తెరిచి చుట్టు పక్కల ఏమి జరుగుతుంది గమనిస్తాము.మళ్ళీ కళ్ళు మూసుకుంటాము.ఇంకో ఐదు నిముషాలు ధ్యానం చేస్తాము.ఓ యమ్మో!ఈ రోజుకు చాలానే కష్టపడిపోయాము అని మనకు మనమే దిష్టి పెట్టుకుంటాము.రేపు చూసుకుందాములే అని లేచేస్తాము.కానీ,అర్జునా!అలా కాదు చేయాల్సింది.అనునిత్యమూ మనోనిగ్రహంతో అభ్యాసం చేయాలి.ధ్యానం చేసే సమయం పెంచుకుంటూ పోవాలి.ఒక నిబద్ధత రావాలి.ఒక నిష్ట ఉండాలి.ఒక ధ్యేయం ఉండాలి.చెయ్యమన్నారు కదా అని బలవంతంగా,ముక్కు మూసుకుని చేయటం కాదు.దానివల్ల ఫలితం ఉండదు.మనకు మనమే ప్రేరణ పొందాలి.ఆ యోగాభ్యాస స్థితిలో మనశ్శాంతి,మనోనిర్మలం పొందాలి.అప్పుడు ఆ భక్తుడు నా స్థితిని,నన్నూ,మోక్షాన్నీ పొందగలుగుతాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment