సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః।
మత్ప్రసాదా దవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్॥56॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా సులభంగా అర్థం అయ్యేలా చెబుతున్నాడు.ఓ అర్జునా!అన్ని కర్మలను ఆచరిస్తున్నా,నన్నే నమ్ముకున్న కర్మయోగి,అవినాశనమైన పరమపదాన్నే పొందుతాడు.ఎందుకంటే అతను నన్నే నమ్ముకుంటాడు.కర్మఫలాన్ని సదా నాకే సమర్పిస్తాడు.తామరాకు మీద నీటిబొట్టులాగా అతనికి ఏ కల్మషమూ అంటదు.భారం అంతా నా మీదే ఉంచి,తను సర్వదా ప్రశాంత చిత్తంతో ఉంటాడు.
No comments:
Post a Comment