చేతసా సర్వకర్మాణ్యపి మయి సన్న్యస్య మత్పరః।
బుద్ధియోగ ముపాశ్రిత్య మచ్చిత్తస్సతతం భవ॥57॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలా అంటున్నాడు. అర్జునా!నీవు ఏమి చెయ్యాలో చెబుతాను విను.ముందరగా సర్వ కర్మలు నాకే సమర్పించు.సమబుద్ధిని ప్రసాదించే యోగాన్ని అవలంబించు.నేనే పరమగతిని అనే విషయం బాగా ఆకళింపుచేసుకో.నీ మనసును,అంతఃకరణాన్నీ నాయందు లగ్నం చేయడంలో సఫలీకృతుడవు కావాలి.అప్పుడే నీవు మోక్ష ప్రాప్తికి అర్హుడవు అవుతావు.
No comments:
Post a Comment