త్వమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత।
తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్॥62॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి అసలు కిటుకు చెబుతున్నాడు.ఓ అర్జునా!హే భరతశ్రేష్టా!నేను చెప్పిన వాటికి అన్నిటికీ జవాబు,ఉపాయం ఒక్కటే ఉంది.అదే ఆ పరమాత్మను మనసా,వాచా, కర్మణా శరణు కోరటం.అతను అత్యంత దయాళువు.అతని దయ,కనికరం,ప్రేమ,వాత్సల్యం నీకు దక్కాయి అనుకో!నీవు ఖచ్చితంగా శాంతినీ,మనశ్శాంతినీ,మోక్షాన్నీ పొందగలుగుతావు.
No comments:
Post a Comment