Wednesday, 19 November 2025
ప్రధమ అధ్యాయము -అర్జున విషాద యోగము…ధర్మక్షేత్రే కురుక్షేత్రే
ధృతరాష్ట్ర ఉవాచ...
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః।
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ॥1॥
కురు క్షేత్ర యుద్ధంకి అన్ని సన్నాహాలూ అయిపోయాయి.పోరు సలిపేదానికి ఇరు వర్గాలూ రణభూమి చేరుకున్నాయి.ధృతరాష్ట్రుడు గ్రుడ్డివాడు కదా!కనిపించదు.రణరంగానికి వెళ్ళి యుద్ధం చేయలేడు.కానీ ఏమవుతుందో అనే ఆదుర్దా,గెలవాలనే ఆకాంక్ష మనిషిని నిలువనీయవు కదా!యుద్ధభూమిలో జరిగేవి జరిగినట్లు,కళ్ళకు కట్టినట్లు చెప్పగలిగేదానికోసరం ,సంజయుడికి దివ్యదృష్టి కలిగించడం జరిగింది.దాని ఆసరాతో సంజయుడు మందిరంలో ధృతరాష్ట్రుడి పక్కనే కూర్చుని,యుద్ధం ఎలా జరుగుతుందో చెప్పేదానికి ఉపక్రమించాడు.
ఈ లోపలే ధృతరాష్ట్రుడికి తొందర!తన కొడుకులు దాయాదులతో తేల్చుకునేదానికి పోరు బాట పట్టారు కదా!అందుకే అడుగుతున్నాడు.
సంజయా!ధర్మ భూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధం చేసేదానికి సమకూడుకున్నారు కదా అందరూ!నా తరఫున నా బిడ్జలు,దుర్యోధనాదులు,ఆవలి తట్టున పాండవులు యేమి చేశారు?
Subscribe to:
Post Comments (Atom)
🙏
ReplyDelete