గీతార్థ శ్రవణాసక్తో మహాపాపయుతోపివా।
వైకుంఠం సమ వాప్నోతి విష్ణునా సహమోదతే॥18॥
విష్ణువు చెబుతున్నాడు.భూదేవీ!జీవితంలో ఎన్ని పాపాలు చేసినా సరే!భగవద్గీతను అర్థ యుక్తంగా వినేదానికి,చదివేదానికి శ్రద్థ,జిజ్ఞాస చూపిస్తే చాలు.వాడు ఖచ్చితంగా వైకుంఠాన్ని పొందుతాడు.అక్కడ విష్ణువు అనుభవించేవన్నీ తనూ అనుభవిస్తాడు.
అంటే దీని అర్థం చెబుతాను.భగవద్గీతా పఠనం సర్వపాప ప్రక్షాళనం చేస్తుంది.భగవద్గీతను నమ్ముకుంటే సరాసరి మోక్షానికి దారి కనుక్కున్నట్లే!
No comments:
Post a Comment