పాఠేఽసమర్థ స్సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్।
తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః॥11॥
భగవంతుడికి మానవుల అశక్తత బాగా తెలుసు.అందుకే చెబుతున్నాడు.ఓ భూదేవీ!మానవులు గీతాపారాయణము సంపూర్ణంగా చేయలేకపోతున్నాము,ఎలా?అని దిగులు పడనక్కరలేదు.
పూర్తిగా గీతా పారాయణ చేసే శక్తి,సమయం,ఇతరత్రా కారణాలు లేకపోయినా,సగము పారాయణ చేసినా ఫలితము దక్కుతుంది.సగము పారాయణ చేసుకున్న వారికి గోదాన పుణ్యము లభిస్తుంది.
హిందూ సంప్రదాయంలో గోవుకు చాలా మహత్మ్యము ఉంది.అలాంటి గోవును దానము చేసిన ఫలము అంటే సామాన్యము కాదు.
No comments:
Post a Comment