చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోఽర్జునమ్।
వేదత్రయీ పరానందా తత్త్వార్థ జ్ఞానమంజసా॥9॥
భగవద్గీత అనేది ఆషామాషీగా తీసుకునే గ్రంథరాజము కాదు.ఇందులో మూడు వేదాల సారము ఇమిడి ఉంది.సత్ చిత్ ఆనందము,మోక్షానికి మార్గము చూపేది,దీని సారము.మనిషికి కావలసిన,అవసరమయిన తత్త్వాలగురించి వివరంగా చెప్పబడి ఉంది.
ఇలా మనసును ప్రక్షాళన చేసే అన్ని విషయాలు క్రోడీకరించబడిన ఈ గీత స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడి నోట అర్జునుడికి ఉపదేశించబడింది.కాబట్టి సర్వ మానవాళికి ఇది శిరోథార్యము.
No comments:
Post a Comment