తతః శ్శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ।
మాథవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః॥14॥1॥
శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము...
కౌరవులు తమ తమ శంఖాలను పూరించిన తరవాత పాండవ పక్షంలో మొదలు అయింది.శ్రీకృష్ణార్జునులు తెల్లటి అశ్వాలను పూన్చిన రథం మీద ఉన్నారు.ఆ బావా బావమరుదులు ఇద్దరూ ఒకే సారి తమ దివ్యమయిన శంఖాలను పూరించారు.ఒళ్ళు పులకరించే దృశ్యం కదా!ఎవరికైనా వాళ్ళిదరినీ జంటగా అలా చూడటం,చూడగలగటం!
No comments:
Post a Comment