Sunday, 3 May 2026

స ఏవాయం మయాతేఽద్య

స ఏవాయం మయాతేఽద్య యోగః ప్రోక్త స్సనాతనః। భక్తోఽసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్॥3॥4॥ శ్రీమద్భగవద్గీత..।జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికే ఎందుకు భగవద్గీత ఉపదేశించాడు?ఎంతో మందికి ఇంకెన్నో సందర్భాలలో చెప్పి ఉండవచ్చు కదా?ఇలా మనకు అనిపిస్తుంది.మాములుగా గురువు శిష్యులకందరికీ ఒకేసారి పాఠం చెబుతాడు.అందరికీ విడి విడిగా చెప్పడు.కానీ మనిషి అన్న తరువాత ఇష్షాయిష్టాలు ఉంటాయి కదా!తనకు ఇష్టమయిన శిష్యుడికి అర్థం కాలేదు అంటే గురువు ఇంకా నిదానంగా,ప్రక్కనే కూర్చోబెట్టుకుని,విడమరచి మరీ చెబుతాడు కదా!ఇక్కడా అంతే!శ్రీకృష్ణుడు ఆ విషయమే చెబుతున్నాడు. అర్జునా!నువ్వు నా భక్తుడవు.నా హితుడవు.నా సఖుడవు.నా బంథువు కూడా!కాబట్టి అత్యుత్తమమయిన ఆ యోగాన్ని స్వయంగా నీకు చెబుతున్నాను.

No comments:

Post a Comment