Saturday, 21 March 2026
క్రోధా ద్భవతి సమ్మోహః
క్రోధా ద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః।
స్మృతిభ్రంశా ద్బుద్ధినాశో బుద్ధినాశా త్ప్రణశ్యతి॥63॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు తన చెలికాడు అయిన అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!చెలికాడా!నీకు శృంఖల చర్య,అదే గొలుసు కట్టు చర్య అంటే తెలుసు కదా!ఒక పని మొదలు పెడితే అక్కడితో ఆగకుండా,మన ప్రమేయం లేకుండానే,మనకు ఊపిరి పీల్చుకునే అవథి కూడా ఇవ్వకుండా వెనువెంటనే జరిగి పోతుంటాయి కొన్ని పనులు.మనము నిర్ఘాంతపడి చూస్తూ ఉండాల్సిందే.ఎందుకంటే ఆ పరిణామాలను మనము ఆపలేము.ఇక్కడ నేను చెప్పబోయేది అదే.మనకు కోపం వస్తుంది.దాంట్లో ఆశ్చర్యం ఏముంది?మామూలే కదా!మనిషి అన్నాక ఆ మాత్రం కోపతాపాలు ఉండవా?అని మనలని మనం సమర్థించుకుంటాము.ఇదే మనము చేసే మొదటి తప్పు.ఎందుకంటే కోపం వస్తే మనము విచక్షణాజ్ఞానాన్ని కోల్పోతాము.విచక్షణ లేదు అంటే ముచ్చటగా అవివేకమనే కదా అర్థం!ఒకటి కొంటే ఒకటి ఉచితం కాదు.ఒకటి కొంటే పది ఉచితం లాగా కలుపుకుని వస్తాయి ఇక్కడ.ఎందుకంటే అవివేకంతో పాటు స్మృతిభ్రంశం అంటుకుంటుంది.అంటే మతి మరుపు.ఇంతకు ముందు మనము నేర్చుకున్న మంచి చెడ్డా,పెద్దా చిన్నా,తప్పూ ఒప్పూ అన్నీ చిటికెలో మాయమవుతాయి.దీని పర్యవశానం ఏందంటే బుద్ది చెడుతుంది.చెడ్డ ఆలోచనలు,చెడ్జ తలపులు,చెడ్డ పనులకు మొగ్గు చూపుతాము.ఒకసారి సద్బుద్ధిని కోపమనే చెదపురుగు తొలిచిందనుకో,ఇంకేముంది?సర్వం నాశనమే!పురుషుడు అథోగతికి జారిపోతాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment