Sunday, 22 March 2026
ప్రసాదే సర్వదుఃఖానాం
ప్రసాదే సర్వదుఃఖానాం హాని రస్యో పజాయతే।
ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతి॥65॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!సఖా!సూక్ష్మంలో మోక్షం అంటారు కదా!ఇది అదే!మనము మన మనసును నిర్మలంగా పెట్టుకోగలిగితే చాలు.చిక్కు ముడి విప్పినట్లు అన్ని సమస్యలూ వాటంతట అవే సర్దుకుంటాయి.మనసు ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది చెప్పు?కోపాలూ,కాపాలూ లేనప్పుడు.ఆశలూ,అసహనాలూ,అసంతృప్తులూ లేనప్పుడు.అంతే కదా!మనసు నిర్మలంగా ఉంటే సుఖదుఃఖాలు ఉండవు.నశిస్తాయి.ఎగిరెగిరీ పడబళ్ళేదు.అథఃపాతాళానికీ కృంగిపోబళ్ళేదు కనుక.అలాంటి వాడి బుద్ధి త్వరగా నిశ్చలత్త్వాన్ని పొందుతుంది.దీనికి ఢోకా లేదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment