Saturday, 21 March 2026

రాగద్వేష వియుక్తైస్తు

రాగద్వేష వియుక్తైస్తు విషయా నింద్రియై శ్చరన్। ఆత్మవశ్యై ర్విధేయాత్మా ప్రసాద మధిగచ్ఛతి॥64॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఓపికగా చిలకకి చెప్పినట్లు చెబుతున్నాడు.అర్జునా!మన వ్యవహారం ఎలా ఉండాలో చెప్పేదా?తామరాకు పైన నీటిబొట్టులాగ ఉండాలి.అంటే నీటి బొట్టు తామరాకు పైన ఉన్నా దానిని నిజంగా అతుక్కుని ఉండదు.సన్నని,పల్చని మైనపు పొర ఆకు పైన ఉంటుంది.దాని వలన నీటి బిందువు స్వేచ్ఛగా,స్వచ్ఛంగా ఆకు మీద ఎలా అయినా కదులుతుంది.అలానే మనం కూడా విషయాలను అనుభవిస్తున్నా,కర్మలను ఆచరిస్తున్నా రాగద్వేషాలకు అతీతంగా మసలుకోవాలి.ఇంద్రియ నిగ్రహం ఎప్పుడూ కోల్పోకుండా ఉండాలి.అప్పుడే మనము మన మనసును మన ఆధీనంలో ఉంచుకోగలము.మన మనసు ఎప్పుడు మన స్వాధీనంలో ఉంటుందో,అప్పుడే మనము నిర్మల మనస్కులము కాగలము.లేక పోతే పట్టుకోండి చూద్దాం అన్నట్లు ఎండమావుల వెంట పరుగులు తీస్తూ ఉంటాము.

No comments:

Post a Comment