Tuesday, 24 March 2026

యా నిశా సర్వభూతానాం

యా నిశా సర్వ భూతానాం తస్యాం జాగర్తి సంయమీ। యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః॥69॥2॥ శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడికి క్రొత్త విషయము చెబుతున్నాడు.అర్జునా!నీకు ఇది తెలుసా?చీకటి,వెలుగు ఉన్నాయి కదా!మాములుగా మనం ఏమి చేస్తాము?వెలుగు,పగలు ఉన్నప్పుడు మనం మెలకువగా ఉంటాము.చీకటి,రాత్రి సమయాలలో నిద్రావస్థలో ఉంటాము.కానీ జ్ఞాని అలా చేయడు.ఏది చీకటో దాని యందు జ్ఞాని మెలకువగా ఉంటాడు.సామాన్యులు మెలకువగా ఉండే సమయం యోగులకు రాత్రితో సమానము.

No comments:

Post a Comment