Wednesday, 25 March 2026

ఏషా బ్రాహ్మీస్థితిః పార్థ

ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి। స్థిత్వాఽస్యామంత కాలేఽపి బ్రహ్మ నిర్వాణ మృచ్ఛతి॥72॥2॥ ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపవిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్య యోగోనామ ద్వితీయోఽధ్యాయః... శ్రీమద్భగవద్గీత..సాంఖ్య యోగము.. శ్రీకృష్ణుడు ఈ శ్లోకంతో సాంఖ్య యోగానికి ముక్తాయింపు చెబుతున్నాడు.అర్జునా!నేను ఇంత సేపు చెప్పింది ఈ బ్రాహ్మీ స్థితి గురించే!ఈ జ్ఞానం పొందిన వారు మోహంలో మునగరు. వారు మరణకాలంలోపల ఈ బ్రాహ్మీస్థితిని పొందగలిగితే చాలు.బ్రహ్మ నిర్వాణ పధం ని పొందగలుగుతారు. ఇట్లు బ్రహ్మ విద్య,ఉపనిషత్తు,యోగశాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జునుల సంవాద రూపమయిన శ్రీమద్భగవద్గీతలో సాంఖ్య యోగము అను రెండవ అధ్యాయము...

No comments:

Post a Comment