Sunday, 15 March 2026

యదా తే మోహకలిలం

యదా తే మోహ కలిలం బుద్ధి ర్వ్యతి తరిష్యతి। తదా గన్తాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ॥53॥2॥ శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి బుద్ధి కుశలత కొంచెం పెంచుకుంటే అన్ని విథాలా మంచిది అని సలహా ఇస్తున్నాడు.ఎంతైనా మిత్రుడు కదా!ఆ మాత్రం మంచీ చెడ్డా చెప్పకపోతే ఎలా? అర్జునా!నేను చెప్పినట్లు విను.ముందర ఈ మోహ పంకిలం,పాప పంకిలం నుంచి బయటపడు.అప్పుడుగానీ ఏదీ సరిగ్గా అర్థంకాదు నీకు.అసలైన దారి గోచరించదు.దాని నుంచి విడిపడినప్పుడే నీ బుద్ధిని పరిశుద్థం చేసుకోగలవు.ఇంక వేరే దగ్గర మార్గాలు లేవు.ఇప్పటికే విన్న విషయాలూ,ఇంక తదుపరి వినవలసిన విషయాలూ నుండీ బయటపడగలతావు.వైరాగ్యమనేది ఊరికే ఆషామాషీగా దక్కదు.మనకు గట్టిగా కావాలనుకున్నది ఒక్కటి దక్కకపోతేనే తీన్తార్ అవుతాము.అలాంటిది సర్వసంగ పరిత్యాగం అంటే మాటలు కాదు కదా!సతతం అభ్యాసం చేయాల్సిందే!దక్కేదాకా ఒక యజ్ఞం,దక్కిన తరువాత నిలబెట్టుకునే యత్నం.అర్థం అయిందా?

No comments:

Post a Comment