Wednesday, 1 October 2025

భగవద్గీతా కించి దధీతా

భగవద్గీతా కించి దధీతా గంగాజలలవ కణికాపీతా। సకృదపి యేనమురారి సమర్చా తస్య కరోతి యమోపినచర్చా॥ నువ్వు నేనూ కాదు,జగద్గురు శంకరాచార్యులవారు కూడా తను రచించిన భజగోవిందమ్ లో భగవద్గీత యొక్క గొప్పదనం చెప్పారు.ఆయన ఇదే చెప్పారు.మనము జీవితంలో ఒక్కసారైనా ఆ శ్రీకృష్ణుడిని,ఆ మురారిని ధ్యానం చేసుకోవాలి.ఒక్క చుక్క అయినా పవిత్రమయిన గంగాజలాన్ని తాగాలి.ఒక్కసారి అయినా కళ్ళ కద్దుకుని భగవద్గీతలోని ఒక్క శ్లోకమయినా శ్రద్ధగా చదవాలి.పైన చెప్పిన ఈ పనులు క్షణకాలమయినా మనస్పూర్తిగా చేస్తే మనము పుణ్యాత్ములకోవలోకి చేరిపోతాము.అప్పుడు యముడు కూడా మన దరిదాపుల్లోకి తచ్చాడేదానికి భయపడతాడు.

No comments:

Post a Comment