Saturday, 11 October 2025

సప్తమ అధ్యాయము….ఫలము

భగవద్గీతలోని ఏడవ అధ్యాయము విజ్ఞాన యోగము.దీని పారాయణము వలన సమస్త జీవజాత సంసార తరణము సంప్రాప్తిస్తుంది. పూర్వము శంకు కర్ణుడు అని ఒకడు ఉండేవాడు.అతను ఒకరోజు పని మీద ప్రక్క ఊరికి వెళ్ళాడు.ఎంతకీ తిరిగి రాడే!అతని కొడుకులకు తండ్రి గురించి ఆదుర్దా అయిపోయింది.వాళ్ళు ఒక సిద్ధుడి దగ్గరకు వెళ్ళారు.తమ తండ్రి జాడ చెప్పమని బతిమలాడారు.ఆ సిద్ధుడు తన దివ్యదృష్టితో అంతా కనుక్కున్నాడు.ఇలా చెప్పనారంభించాడు.నాయనా!మీ తండ్రి మరణించి చాలా రోజులు అయింది.అతను బతికి ఉన్నప్పుడు చాలా సంపాదించాడు.సంపాదించినది మొత్తం ఒక చోట భద్రపరిచాడు.ప్రాణం పోయినా,డబ్బు మీద మమకారం,మోహము వదులుకోలేక పోయాడు.అందుకని తరువాత జన్మలో పాముగా పుట్టాడు.పాముగా ఇప్పుడు ఆ నిథికి కాపలా కాస్తున్నాడు.మీకు చూపిస్తా రండి అని చెప్పి వాళ్ళను అక్కడకు తీసుకెళ్ళాడు.వాళ్ళు ఆ దృశ్యం చూసి చాలా బాథ పడ్డారు.మా తండ్రికి ఏంది ఈ నికృష్టపు జన్మ అని.మా తండ్రిని ఈ దీనమయిన,హేయమయిన దుస్థితి నుంచి ఉద్ధరించే మార్గము ఉంటే చెప్పమని వేడుకున్నారు. అప్పుడు ఆ సిద్ధుడు ఇలా చెప్పాడు. శ్లోకము.... గీతానాం సప్తమాధ్యాయ మంతరేణ సుధామయమ్। జన్తోర్జరామృత్యు దుఃఖ నిరాకరణ కారణమ్॥ శ్లోకము... సప్తమాధ్యాయ జపతో ముక్తిభాజోఽభవంస్తతః। దేవమిష్ట తమం జ్ఞాత్వా నిర్వాహణార్పిత బుద్ధయః॥ పురాణాలలో ఇలా చెప్పబడి ఉంది.కాబట్టి అనుష్ఠాన పూర్వకంగా మీరు గీతలోని ఏడవ అధ్యాయము పారాయణ చేయండి.ఆ ఫలమును మీ తండ్రికి ధారపోయండి. ఈ మాటలు విన్న వారు ఆ సిద్ధుడికి నమస్కరించి ఇండ్లకు వెళ్ళారు.పద్ధతిగా సిద్ధుడు చెప్పినట్లు చేసారు.వాళ్ళ తండ్రికి పరమపదము ప్రాప్తించేదానికి దోహద పడ్డారు.

No comments:

Post a Comment